బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా  తెలంగాణలో జరగాల్సిన రెండు బహిరంగ సభలు రద్దయ్యాయి. గురువారం నాడు ఉభయ రాష్ట్రాల్లో  నాలుగు సభల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది.

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో జరగాల్సిన రెండు బహిరంగ సభలు రద్దయ్యాయి. గురువారం నాడు ఉభయ రాష్ట్రాల్లో నాలుగు సభల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. తెలంగాణలో జరగాల్సిన రెండు సభలను అమిత్ షా రద్దు చేసుకొన్నారు. ఏపీలో జరిగే రెండు సభల్లో అమిత్ షా పాల్గొంటారని సమాచారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉదయం వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గురువారం నాడు అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అహ్మదాబాద్ నుండి అమిత్ షా నుండి నేరుగా హైద్రాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది.

అయితే ప్రధానమంత్రి మోడీతో అత్యవసర సమావేశాల కారణంగా అమిత్ షా తెలంగాణ సభలను రద్దు చేశారు. దీంతో కరీంనగర్, వరంగల్ సభల్లో తెలంగాణ రాష్ట్ర నాయకులతోనే సభలు నిర్వహించారు.మరో వైపు ఏపీ రాష్ట్రంలో నర్సరావుపేట, విశాఖపట్టణం బహిరంగ సభల్లో అమిత్ షా యధావిధిగా పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.