షియోమీ మెగా ఈవెంట్.. ఒకేసారి 5 డివైజ్ల ఆవిష్కరణ
నూతన ఉత్పత్తులను ఎంతో వేగంగా ఆవిష్కరించే షియోమీ ఈసారి మెగా ఈవెంట్ నిర్వహించనున్నది. ఈ నెల 5న జరగనున్న ఈ కార్యక్రమంలో ఒకేసారి ఐదు వేరువేరు డివైజ్లను ఆవిష్కరించ బోతున్నది. వీటిలో 108 ఎంపీ కెమెరా స్మార్ట్ ఫోన్, ఎంఐ5 స్మార్ట్ టీవీ5, ఎంఐ స్మార్ట్వాచ్లు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
బీజింగ్: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ భారీ ఎత్తున కొత్త డివైజ్ల ఆవిష్కరణకు సిద్ధమైంది. ఈ నెల ఐదో తేదీన చైనాలో జరగనున్న ఓ భారీ కార్యక్రమంలో ఐదు ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకేసారి విడుదల చేయనుంది షియోమీ.
తొలిసారి 108 మెగా పిక్సెల్స్ కెమెరాతో.. ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్ఫోన్ను తేనున్నట్లు షియోమీ ఇప్పటికే ప్రకటించింది. షియోమీ తలపెట్టిన మెగా ఈవెంట్లో ఈ కొత్త మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
also read ఐదేళ్లలో 3,427 బ్యాంకుల... మూసివేత...ఎందుకంటే...?
షియోమీ మెగా ఈవెంట్లో.. ఎంఐ 5 రేంజ్ స్మార్ట్ టీవీని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు షియోమీ ఎంఐ 4 రేంజ్లో.. పలు స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించే ఎంఐ 5 టీవీల్లో సరికొత్త ఫీచర్లు జోడించినట్లు తెలుస్తోంది.
తొలిసారి షియోమీ క్యూఎల్ఈడీ ఫీచర్తో ఎంఐ 5 రేంజ్ టీవీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఈ మోడల్.. 12ఎన్ఎం ప్రాసెసర్తో, 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ రామ్ సామర్థ్యంతో పని చేయనున్నది. దీని ధర, ఇతర కీలక ఫీచర్లు ఈ నెల 5వ తేదీన జరిగే మెగా ఈవెంట్లో తెలియజేయనున్నది షియోమీ.
also read దేశంలో ఇంత బంగారం ఉందా!
ఆపిల్ స్మార్ట్వాచ్ తరహాలోనే షియోమీ కూడా తొలిసారి ఎంఐ స్మార్ట్వాచ్ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్వాచ్ ఎంఐయూఐ ఓఎస్ ఆధారంగా పని చేస్తుందని షియోమీ ఇప్పటికే ప్రకటించింది.
నాటి నుంచి షియోమీ స్మార్ట్ వాచ్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీని ధర సహా ఇతర వివరాలు తెలియాలంటే ఈ నెల 5 వరకు ఆగాల్సిందే. ఈ మెగా ఈవెంట్లో ఎంఐ పవర్ బ్యాంక్3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ మ్యాక్స్ కొనసాగింపు వెర్షన్ను ఆవిష్కరించనుంది షియోమీ.