ఆరేళ్లలో 50 లక్షల కొలువులు.. ఇదీ నాస్కామ్ టార్గెట్
స్టార్టప్ల సహకారంతో ఐటీ రంగంలో దేశీయంగా ఆరేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నది నాస్కామ్. కొత్త ఉద్యోగాల సంఖ్యను 12.50 లక్షలకు చేర్చాలన్నది నాస్కామ్ నిర్ణయం.
న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థల ద్వారా 2025 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాస్కామ్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. మన దేశంలో యూనికార్న్ల సంఖ్యను 2025 నాటికి 95–105కి చేర్చాలని నాస్కామ్ మరో టార్గెట్.
ఈ యూనికార్న్ల వ్యాల్యుయేషన్ 350–390 బిలియన్ డాలర్లుగా ఉండేలా చూడాలని లక్ష్యంగా పనిచేస్తోంది. స్టార్టప్ ఎకో సిస్టమ్ ద్వారా ఏర్పడే కొత్త ఉద్యోగాల సంఖ్యను కూడా 12,50,000 కి చేర్చాలని ధ్యేయంగా పెట్టుకుంది.
బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్ అందుకున్న స్టార్టప్ను యూనికార్న్గా వ్యవహరిస్తున్నారు. స్టార్టప్ ఎకో సిస్టమ్లో ఇండియా మూడో ప్లేస్లో ఉన్నదని నాస్కామ్ మంగళవారం విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది.
also read సెర్చింజన్తో ఇలా మీ గుట్టుమట్లు ఫుల్ సేఫ్
ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉన్న దేశంగా ఇండియా కొనసాగుతోంది. 2019లో ఇండియాలో కొత్తగా 1300 స్టార్టప్లు ఏర్పడ్డాయని నాస్కామ్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలో 8900–9300 టెక్ స్టార్టప్స్ ఉన్నాయని, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 7700–8200 మాత్రమేనని తెలిపింది.
స్టార్టప్ల సంఖ్యతోపాటే వాటిలో పెట్టుబడులూ భారీగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో స్టార్టప్స్లో పెట్టుబడులు రూ.31,113 కోట్ల (4.4 బిలియన్ డాలర్లు)కు చేరాయని నాస్కామ్ నివేదిక పేర్కొన్నది. ఈ పెట్టుబడులను 450 స్టార్టప్లు దక్కించుకున్నాయని తెలిపింది.
ఎర్లీ స్టేజ్ ఫండింగ్ కూడా పెరిగి రూ. రూ.11,34,16,80,000 (1.6 బిలియన్ డాలర్లు)కు చేరుకుందని వెల్లడించింది. ఇన్నోవేటర్ల సామర్ధ్యాన్ని పెంపొందించడంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ పాత్ర చాలా ఉందని నాస్కామ్ పేర్కొన్నది.
వివిధ రంగాలలోని కంపెనీలు భవిష్యత్లో డిజిటల్గా మారేందుకు ప్రయత్నించనుండటంతో, సంబంధిత టెక్నాలజీలకు మరింత ఊపు రానుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్ యాని ఘోష్ చెప్పారు. దేశంలోని స్టార్టప్స్ ఒక్క 2019 లోనే 60 వేల కొత్త ఉద్యోగాలు కల్పించాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ ఉద్యోగాల సంఖ్య 40 వేలు.
యూనికార్న్గా ఎదిగే సామర్ధ్యమున్న మరో 50 స్టార్టప్స్ను కూడా గుర్తించినట్లు నాస్కామ్ తెలిపిందిది. ఈ స్టార్టప్స్ ఒక్కొక్కటి ఇప్పటికే 50 మిలియన్ డాలర్లకు మించిన నిధులు సమీకరించగలిగాయి. గ్రే ఆరెంజ్, గ్రోఫర్స్, పైన్లాబ్స్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయని నాస్కామ్ తెలిపింది.
డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ ఏర్పాటు 33 శాతం పెరిగిందని పేర్కొంది. మెడికల్ డయాగ్నస్టిక్స్, ప్రెసిషన్ ఎగ్రికల్చర్, ఫ్రాడ్ డిటెక్షన్ వంటి విభాగాలలో ఏర్పాటైన స్టార్టప్సూ ఇందులో ఉన్నాయని తెలిపింది.
also read కాగ్నిజెంట్ తర్వాత ఇన్ఫోసిస్ వంతు.. 13 వేల కొలువులు గోవిందా
స్థానికంగా ఉండే సమస్యలకు టెక్నాలజీతో సొల్యూషన్స్ అందించే ఇన్నోవేషన్ మన దేశంలో సాధారణమని, కాకపోతే ఇది ఊపందుకోవడానికి ప్రభుత్వం, కార్పొరేట్లు, ఇతర స్టేక్ హోల్డర్లు మరింత చురుగ్గా భాగం పంచుకోవాలని నాస్కామ్ రిపోర్టు అభిప్రాయపడింది. ఇండియాలో 335 ఇన్క్యుబేటర్లు, యాక్సిలరేటర్లు చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
యూనికార్న్ స్థాయికి చేరాలనే ఆకాంక్ష ఉన్న కంపెనీల సంఖ్యా పెరుగుతోందని నాస్కామ్ వివరించింది. యూనికార్న్ అంటే వ్యాల్యుయేషన్ పరంగా బిలియన్ డాలర్లు (రూ. 7 వేల కోట్లు) అందుకోవడం. 2019 లో ఇండియాలో 7 కొత్త యూనికార్న్లు అవతరించాయి. దీంతో యూనికార్న్ల సంఖ్య 24 కి పెరిగింది.
ఎక్కువ యూనికార్న్లు ఉన్న దేశాలలోనూ మూడో ప్లేస్లో మన దేశం నిలుస్తోంది. బిగ్బాస్కెట్, డెల్హివరీ, రివిగో, డ్రీమ్11,ద్రువ, ఓలా ఎలక్ట్రిక్, ఐసెర్టిస్లు కొత్తగా యూనికార్న్లుగా అవతరించాయి. యూనికార్న్లలో 71 శాతం బీ2బీ పైనే ఫోకస్ పెడుతున్నాయి. యూనికార్న్స్లో 57 శాతం గేమింగ్, సప్లై చెయిన్, లాజిస్టిక్స్, ఆటోమోటివ్ రంగాల స్టార్టప్సే ఉన్నాయి.