సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో అదుర్స్ (వీడియో)
సోషల్ మీడియాలో వైరల్
ప్రకృతి గురించి ఆలోచించాలంటూ ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు తరచుగా చెబుతుంటారు. ఈ క్రమంలో సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి చెక్క(కట్టె)తో రూపొందించిన బైక్పై వెళ్తుండగా ఈ వీడియో తీశారు. బైకు మీద వెళ్తున్న వ్యక్తికి తనబైక్తో పాటు ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టమంటూ ట్వీట్ చేశారు. కచ్చితంగా వాడాల్సిన పార్ట్స్ మినహా ఇతర బైక్ విడి భాగాలు చెక్కతో తయారు చేశారు. చెట్లను కొట్టివేసి బైకును తయారుచేశారు కదా అని కొందరు ట్వీట్లు మొదలుపెట్టారు.
Bike se pyaar , Nature se bhi pyaar ! pic.twitter.com/Qxn0ckGrea
— Virender Sehwag (@virendersehwag) June 8, 2018