మొన్న రాజ్కోట్లో... నేడు ఉప్పల్లో.. కోహ్లీని వెంటాడుతున్న అభిమానులు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను ఒక్కసారి చూసి.. చిన్న సెల్ఫీ దిగితే చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను ఒక్కసారి చూసి.. చిన్న సెల్ఫీ దిగితే చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.
అయితే ఫ్యాన్స్ ఓవరాక్షన్ కోహ్లీకి అసహనాన్ని కలిగిస్తోంది. మొన్న రాజ్కోట్ టెస్టులో విరాట్ బ్యాటింగ్కు వస్తుండగా.. ఇద్దరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అయితే ఇది పద్దతికాదని కోహ్లీ సున్నితంగా వారించినప్పటికీ వారు వినిపించుకోలేదు..
తాజాగా ఉప్పల్లో జరుగుతున్న రెండో టెస్టులోనూ అభిమానులు కోహ్లీని వెంటాడారు. మైదానంలో బారికేడ్లను తొలగించుకుని మరీ ఒక అభిమాని పరిగెత్తుకుంటూ హల్చల్ చేశాడు. విరాట్ని హత్తుకుని నానా హంగామా చేశాడు.
ఈ పరిణామానికి దిగ్బ్రాంతికి గురైన అశ్విన్, పృథ్వీషా అక్కడికి వచ్చి సారథికి రక్షణగా నిలుచున్నారు. వెంటనే ఆ అభిమాని వారందరీతో సెల్ఫీ దిగాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లిపోయారు.
అబ్బా.. ఏం పట్టాడో...పాక్ క్రికెటర్ స్టన్నింగ్ క్యాచ్
శార్దూల్ కు అచ్చిరాని ఆరంగేట్రం: గాయపడి వెనక్కి
లైంగిక దాడి: మలింగపై చిన్మయి సంచలన ఆరోపణ
యువతితో విరాట్ ఫోటో.. నెటిజన్ల ట్రోల్స్
మాథ్యూ హెడెన్ తలపై తమిళనాడు మ్యాప్ : జాంటి రోడ్స్
నాకు లంచం ఆఫర్ చేశాడు.. ఆసిస్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
వెస్టిండిస్కు మరో ఎదురుదెబ్బ...వన్డే,టీ20 సీరిస్లకు గేల్ దూరం