Asianet News TeluguAsianet News Telugu

ధోనీ బంతి "మిస్టరీ" వీడింది ... ‘‘ధోనీ మనల్ని వదిలి అప్పుడే వెళ్లడు’’

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణాయాత్మక చివరి వన్డేలో ఓడిపోయిన అనంతరం.. ఆ రోజు ఏ బంతితో మ్యాచ్ జరిగిందో ఆ బంతిని అంపైర్ల నుంచి ధోనీ తీసుకుని మైదానాన్ని వీడటం.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది

team india coach Ravi shastri commments against Dhoni ball Taken from umpire

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణాయాత్మక చివరి వన్డేలో ఓడిపోయిన అనంతరం.. ఆ రోజు ఏ బంతితో మ్యాచ్ జరిగిందో ఆ బంతిని అంపైర్ల నుంచి ధోనీ తీసుకుని మైదానాన్ని వీడటం.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో టెస్టులకు వీడ్కోలు చెప్పే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్లు తీసుకుని.. ఆ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించడంతో.. ఆ సందర్భాన్ని ఈ సందర్భంతో పోల్చి.. ధోనీ వన్డేల నుంచి తప్పుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అభిమానులు కూడా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్ చేశారు.. ఈ నేపథ్యంలో  ధోనీ ‘‘బంతి మిస్టరీ’’ని ఛేదించేందుకు టీమిండియా కోచ్ రవిశాస్త్రి రంగంలోకి దిగారు. ఎంఎస్ మనల్ని వదిలి అప్పుడే ఎక్కడికి వెళ్లడం లేదు.. అతడు భారత జట్టుతో ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. ఆ రోజు అంపైర్ల నుంచి బంతిని తీసుకున్న ఉద్దేశ్యం వేరే ఉంది..

మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి.. బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు తప్పించి.. అతనికి ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదు.. అంటూ రవిశాస్త్రి తెలిపాడు. ఆయన వివరణ ఇచ్చాకా ధోనీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. 

Follow Us:
Download App:
  • android
  • ios