స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మరో మైలు రాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో 7 వేల పరుగుల మార్క్ను అధిగమించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్ ప్రారంభంలో రోహిత్ శర్మకు అదృష్టం సహకరించింది. ప్రసిధ్ కృష్ణ వేసిన ఓవర్లో ఇచ్చిన క్యాచ్ను గెరాల్డ్ కోయిట్జీ వదిలేశాడు. ఆ తర్వాతి ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సునాయస క్యాచ్ను డ్రాప్ చేశాడు. ఇలా రెండు లైఫ్లను పొందిన రోహిత్.. ఆ తర్వాత ఫామ్లోకి వచ్చాడు. కేవలం 28 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు.
ఐపీఎల్ 9వ ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన బంతిని సిక్సర్గా మలిచిన రోహిత్... ఐపీఎల్లో 7వేల పరుగుల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫీట్తో పాటు అతను 300 సిక్సర్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు.
ఐపీఎల్ టాప్ రన్ స్కోరర్స్ (2025 వరకు):
విరాట్ కోహ్లీ – 8618 పరుగులు
రోహిత్ శర్మ – 7000+ పరుగులు
శిఖర్ ధావన్ – 6769 పరుగులు
డేవిడ్ వార్నర్ – 6565 పరుగులు
సురేశ్ రైనా – 5528 పరుగులు
ఎంఎస్ ధోనీ – 5439 పరుగులు
ఐపీఎల్లో అత్యధిక సిక్సులు:
క్రిస్ గేల్ – 357
ఎంఎస్ ధోనీ – 364
రోహిత్ శర్మ – 300+
విరాట్ కోహ్లీ – 291