టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ కుమారుడు జరోవర్ భారత జట్టు ఆటగాళ్లతో కలుపుగోలుగా తిరుగుతుంటాడు.
న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు శిఖర్ ధావన్ కుమారుడు జరోవర్ భారత జట్టు ఆటగాళ్లతో కలుపుగోలుగా తిరుగుతుంటాడు. ఐపీఎల్ టోర్మమెంట్ సమయంలో భారత బౌలర్ భువనేశ్వర్, జరోవర్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఇద్దరూ కలిసి అప్పుడప్పుడూ బయటకు వెళ్తుంటారు. ఇద్దరి మధ్య ఇటీవల జరిగిన ఓ హాస్య సన్నివేశాన్నిభువీ గుర్తు చేసుకున్నాడు. ఓసారి భువనేశ్వర్ భార్య నూపుర్ తో జరోవర్ ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో భువీ అక్కడికి వచ్చాడు.
జరోవర్ను ఆటపట్టించాలనే ఉద్దేశంతో అతన వద్దకు వెళ్లి నూపుర్ ను చూపిస్తూ, ఆమె నా భార్య అని గట్టిగా అన్నాడు. దీనికి జరోవర్ ఏ మాత్రం తడుముకోకుండా జవాబిచ్చాడు.
ఆమె నా భార్య, ఆదివారం మాత్రమే నీకు భార్య అని అనడంతో భువీ నోరు వెళ్లబెట్టాడు. ఆ తర్వాత అందరూ కలిసి హాయిగా నవ్వుకున్నారు. ఈ విషయాన్ని చెప్పి భువీ పగలబడి నవ్వాడు.
