Asianet News TeluguAsianet News Telugu

Badminton Asia Team Championships: చ‌రిత్ర సృష్టించిన భార‌త బ్యాడ్మింట‌న్ టీమ్.. !

Badminton Asia Team Championships: మలేషియాలోని షా ఆలమ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్‌లో జపాన్‌ను 3-2తో ఓడించి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శనివారం చరిత్ర సృష్టించింది. 
 

Badminton Asia Championships:India's badminton team creates history,  Youngsters steer India to final with 3-2 win over Japan RMA
Author
First Published Feb 17, 2024, 4:05 PM IST

Badminton Asia Team Championships: తొలి బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరి భారత మహిళలు చరిత్ర సృష్టించారు. మలేషియాలోని సెలంగోర్‌లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల జట్టు 3-2తో జపాన్‌ను ఓడించి తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. సింగిల్స్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత పివి సింధు ఓడిపోయినప్పటికీ, యంగ్ ప్లేయ‌ర్లు అష్మితా చలిహా, అన్మోల్ ఖర్బ్ అద్భుతమైన ప్రదర్శనతో అద‌ర‌గొట్టారు. గాయత్రీ గోపీచంద్, జాలీ ట్రీసా జంట కూడా ఈ సంచలన విజయానికి దోహదపడింది.

గ్రూప్ దశలో టాప్-సీడ్ చైనాను అద్భుతంగా ఓడించడం ద్వారా భారత్ త‌న గేమ్ ను కొన‌సాగించింది. క్వార్టర్ ఫైనల్‌లో హాంకాంగ్ చైనాను 3-0తో చిత్తు చేసింది. జపాన్‌తో జరిగిన సెమీ-ఫైనల్ పోరు బ‌లంగా క‌నిపించింది. అనేక స‌వాళ్ల మ‌ధ్య అయా ఒహోరితో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సింధు ఆశ్చర్యకరమైన ఓటమిని ఎదుర్కొంది. అయితే, ఎదురుదెబ్బ తగలకుండా, ఉత్కంఠభరితమైన డబుల్స్ పోటీలో యువ జంట గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా 21-17, 16-21, 22-20తో విజయం సాధించి 1-1తో సమం చేసింది.

రోహిత్ కెప్టెన్సీలో భార‌త్ T20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తుంది.. జైషా కామెంట్స్ పై హిట్ మ్యాన్ రియాక్ష‌న్ వైరల్ !

ప్రపంచ నం. 55వ ర్యాంక్‌లో ఉన్న 24 ఏళ్ల అష్మితా చలిహా 21-17, 21-14తో మాజీ ప్రపంచ నం.1 నొజోమి ఒకుహరను మట్టికరిపించి, భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించింది. డబుల్స్‌లో ఓటమి పాలైనప్పటికీ, 16 ఏళ్ల జాతీయ ఛాంపియన్ అన్మోల్ ఖర్బ్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో మంచి ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. సైనా నెహ్వాల్ అభిమాని, అన్మోల్ చెప్పుకోదగ్గ ప్రశాంతత, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 29వ ర్యాంకర్ నట్సుకి నిదైరాను 52 నిమిషాల్లో 21-14, 21-18తో ఓడించి, భారత్ చారిత్రాత్మకమైన ఫైనల్‌లోకి ప్రవేశించింది.

 

 బ్యాడ్మింటన్‌ ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్ 2024లో మహిళల ఈవెంట్ ఫైనల్‌లో భారత్ ఇప్పుడు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. మరో సెమీ-ఫైనల్‌లో థాయిలాండ్ 3-1తో ఇండోనేషియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత మహిళల జట్టు స్వర్ణం కైవసం చేసుకుని బ్యాడ్మింటన్ ప్రయాణంలో చెప్పుకోదగ్గ మైలురాయిని చేరుకోవాల‌ని చూస్తోంది.

IPL 2024 - CSK : ధోని తో జోడీ క‌ట్టిన కత్రినా కైఫ్.. !

Follow Us:
Download App:
  • android
  • ios