“నిర్జల” అంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయడం. ఈ విధంగా ఉపవాసం చేస్తే కోటిపాటు పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మహాభారతంలో కూడా దీనికి ప్రాధాన్యం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయని మనకు తెలుసు. వాటిలో అత్యంత ప్రత్యేకమైనదే నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. 2025లో ఇది జూన్ 6, శుక్రవారం రోజున వస్తోంది. ఈ రోజు ఉపవాసం చేయడం ద్వారా విశిష్టమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది చాలా కఠినమైన ఉపవాసం. “నిర్జల” అంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయడం. ఈ విధంగా ఉపవాసం చేస్తే కోటిపాటు పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మహాభారతంలో కూడా దీనికి ప్రాధాన్యం ఉంది.

ఈ రోజు ప్రత్యేకతలు ఏమిటి?

ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి పూజించడం వల్ల శుభఫలితాలు లభిస్తాయి.పెళ్లి కావలసిన వారు, సంతానం ఆశిస్తున్న వారు ఈ రోజు ఉపవాసంతోపాటు భక్తిపూర్వకంగా పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం.జాతక దోషాలు తొలగిపోతాయి, గృహశాంతి చేకూరుతుంది.

 ఉపవాసం ఎలా పాటించాలి?

ఆరోగ్యంగా ఉన్న వారు సంపూర్ణ నిర్జల ఉపవాసం చేయవచ్చు. అంటే.. తినకుండా, తాగకుండా ఉన్నారు.పిల్లలు, వృద్ధులు, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలతో, నీరు లేదా పండ్లు తీసుకుంటూ ఉపవాసం కొనసాగించవచ్చు.ఉదయం అభ్యంగన స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి చిత్రాలు లేదా విగ్రహాలను పూజించి, పుష్పాలు, పండ్లతో నైవేద్యం సమర్పించాలి.

"ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని పఠించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.రాత్రి జాగరణ చేసి భక్తిగానాలు వినడం లేదా పారాయణం చేయడం మంచిది.నీటి దానం, పేదలకు ఆహారం, దుస్తుల దానం వంటి దాన కార్యాలు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఉపవాస విరమణ

నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని తదుపరి రోజు ఉదయం, అంటే జూన్ 7న స్నానం చేసిన తరువాత భోజనం చేసి ముగించాలి.

నిర్జల ఏకాదశి ఉపవాసం శరీరానికి , మనసుకు, ఆత్మకు శుభతని తీసుకురావడమే లక్ష్యం. భక్తితో పాటించే ఈ ఒక రోజు జీవితానికే మార్గదర్శకంగా నిలవచ్చు.