బస్సు యాత్ర చేస్తూ అంబులెన్స్ కి దారిచ్చిన సీఎం జగన్..క్షణాల్లో రోడ్డు క్లియర్
Andhra Pradesh Mar 29, 2024, 10:42 AM IST
పేదవారితో ఆప్యాయంగా మమేకమైన సీఎం జగన్.. వారి సంతోషం చూడండి
Andhra Pradesh Mar 29, 2024, 10:40 AM IST
ఉత్తరాంధ్రలో మరో ముఖ్యమైన నియోజకవర్గం శ్రీకాకుళం. ప్రధాన నగరమే కాదు జిల్లా కేంద్రంతో కూడిన ఈ అసెంబ్లీలో పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఆయనే శ్రీకాకుళం బరిలో నిలిచారు.
Andhra Pradesh Mar 28, 2024, 9:52 PM IST
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా సతివాడ, భోగాపురం సెగ్మెంట్లు రద్దయి.. భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల, డెంకాడ మండలాలతో భోగాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో నుంచి నేటి వరకు ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి అప్పలనాయుడు, 2014లో టీడీపీ అభ్యర్ధి పతివాడ నారాయణ స్వామి నాయుడు, 2019లో వైసీపీ తరపున అప్పలనాయుడు విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జ్యూట్ మిల్లు నెల్లిమర్లలోనే వుంది. అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు సీఎం వైఎస్ జగన్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి జనసేన నెల్లిమర్ల స్థానాన్ని దక్కించుకుంది. లోకం మాధవిని అభ్యర్ధిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్.
Andhra Pradesh Mar 28, 2024, 9:49 PM IST
ఉత్తరాంధ్రలోని మరో నియోజకవర్గం పాతపట్నం. ఇక్కడ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసిపిదే విజయం. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని వైసిపి పోటీలో పెట్టింది. ఇక టిడిపి మామిడి గోవిందరాజును బరిలో నిలిపింది.
Andhra Pradesh Mar 28, 2024, 8:29 PM IST
1955లో ఏర్పడిన గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం , బొండపల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామి మండలాలున్నాయి. రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో కాపు , క్షత్రియ, కొప్పల వెలమ సామాజిక వర్గాలదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ 5 సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ , స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కొక్కసారి విజయం సాధించాయి. గజపతుల కోటలో మరోసారి జెండా ఎగురవేయాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యకు మరోసారి అవకాశం కల్పించారు. టీడీపీ అభ్యర్ధిగా కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ కేటాయించారు చంద్రబాబు .
Andhra Pradesh Mar 28, 2024, 8:25 PM IST
బొత్స అంటే చీపురుపల్లి.. చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురులేకుండా పోయింది. టీడీపీ ఆరు సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ , ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి. బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును బరిలో దించాలని ఆయన వ్యూహం రచిస్తున్నారు.
Andhra Pradesh Mar 28, 2024, 7:03 PM IST
శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు సాగే నియోజకవర్గాల్లో పలాస ఒకటి. ఇక్కడినుండి ప్రస్తుతం మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఆయననే వైసిపి పోటీలో నిలపగా టిడిపి గౌతు శిరీషను బరిలోకి దింపింది. ఇద్దరు బలమైన నేతల పోటీతో పలాస పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.
Andhra Pradesh Mar 28, 2024, 6:50 PM IST
చారిత్రకంగా, సాంస్కృతికంగా బొబ్బిలి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. పౌరుషానికి, సాహసానికి, త్యాగానికి బొబ్బిలి యుద్ధం ప్రతీక. తమిళనాడులోని తంజావూరు తర్వాత బొబ్బిలి వీణలకు అంతటి ప్రాధాన్యత వుంది. బొబ్బిలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఇక్కడి నుంచి 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. బొబ్బిలి రాజవంశీకులదే ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం. తొలి నుంచి నేటి వరకు వారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. బొబ్బిలి కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు. ఈసారి బొబ్బిలి సంస్థాన వారసుడు బేబినాయనకు టీడీపీ టికెట్ కేటాయించింది.
Andhra Pradesh Mar 28, 2024, 5:42 PM IST
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో వైసిపి కాస్త బలంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరులిద్దరూ ఈ నరసన్నపేట నుండి ప్రాతినిధ్యం వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న కృష్ణదాస్ మరోసారి బరిలో నిలిచారు. మరి ఈసారి నరసన్నపేట ఓటర్ల తీర్పు ఎలావుంటుందో చూడాలి.
Andhra Pradesh Mar 28, 2024, 5:14 PM IST
సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు, పాచిపెంట, మెంటాడ,మక్కువ మండలాలున్నాయి. గిరిజన ఓటర్లతో వుండే ఈ సెగ్మెంట్.. ఎస్టీ రిజర్వ్డ్. గిరిజన, కాపు, కొప్పుల వెలమ, దళితులతో పాటు నాగవంశం కులాలు అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేస్తున్నాయి. సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఐదు సార్లు, కాంగ్రెస్ మూడు సార్లు, స్వతంత్రులు, వైసీపీ రెండేసి సార్లు, కృషికార్ లోక్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐలు ఒక్కోసారి సాలూరులో విజయం సాధించాయి. రాజన్న దొర 2009 నుంచి 2019 వరకు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సాలూరుపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. బలమైన నేత , ప్రస్తుత డిప్యూటీ సీఎం రాజన్న దొరకు మరోసారి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు.
Andhra Pradesh Mar 28, 2024, 4:34 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి సీటు చాలా కీలకంగా మారింది. ఇక్కడి నుండి రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో వున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసిపి... ఎలాగైనా మళ్లీ గెలింపించుకోవాలని టిడిపి పట్టుదలతో వున్నాయి. ఇలా ఇరుపార్టీలు టెక్కలి అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితం ఎలావుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra Pradesh Mar 28, 2024, 4:00 PM IST
కురుపాం రాజవంశీకులు పార్వతీపురంపై ప్రభావం చూపుతున్నారు. ఎన్నికల్లో రాజులు ఎవరికి మద్ధతు ఇస్తే వారిదే విజయం. క్షత్రియులతో పాటు బీసీ, ఎస్సీ ఓటు బ్యాంక్ అధికం. అన్నింటికి మించి కొప్పల వెలమలు అభ్యర్ధుల గెలుపొటములను శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీలు ఐదేసి సార్లు.. ఇండిపెండెంట్లు రెండు సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, వైసీపీలు ఒక్కోసారి విజయం సాధించాయి. పార్వతీపురంలో 2019 నాటి రిజల్ట్ను అందుకోవాలని జగన్ పట్టుదలతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగారావుకే ఆయన టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్ధిగా బోనెల విజయ్ చంద్రకు అవకాశం కల్పించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 28, 2024, 3:28 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకే ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తులొ భాగంగా ఈ సీటు బిజెపికి దక్కింది. ఇక వైసిపి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చింది.
Andhra Pradesh Mar 28, 2024, 2:48 PM IST
నాగూరు నియోజకవర్గాన్ని 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుపాంగా మార్చారు. శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా , ఆయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అనంతరం ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కురుపాంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్, 2014, 2019లలో వైసీపీలు విజయం సాధించాయి. కురుపాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి మరోసారి టికెట్ కేటాయించారు. తొయ్యపు జగదేశ్వరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 27, 2024, 10:00 PM IST