స్పీడ్ 40 దాటితే ఫైన్ కట్టాల్సిందే రూ.400 ఫైన్    

‘నేను కారు/ బైక్ నడిపానంటే.. స్పీడు కనీసం 100కి తక్కువకి నడపను తెలుసా.. ’ ఇలా చాలా మంది గొప్పలు పోతూ ఉంటారు.

అలాంటి వాళ్లు మాత్రం బందర్ రోడ్డుపై వెళ్లేటప్పడు మాత్రం వారి రూల్స్ పక్కన పెట్టాల్సిందే. లేకపోతే.. జేబుకు కన్నం పడటం కాయం. అర్థం కాలేదా..

బందర్ రోడ్డు పై ప్రయాణించే బైక్ లేదా కారు.. వాహనం ఏదైనా కనీస స్పీడు 40కి మించకూడదు.

ఒక వేళ మించితే ట్రాఫిక్ అధికారులకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. స్పీడు 40కి మించి
వాహనం నడిపితే.. రూ.400కి పైగా చలానా కట్టాల్సి ఉంటుంది.ఇలా మీరు ఎన్నిసార్లు నియమాలు అతిక్రమిస్తే అన్ని రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. 

బందర్ రోడ్డులో వాహనదారులు అతి వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు గురౌతున్నారని..

దానిని అరికట్టేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.