హైదరాబాద్ శివారులో దారుణం భూవివాదంలో యువకుడిని గన్ తో కాల్చిన దుండగులు యువకుడి పరిస్థితి విషమం

హైదరాబాద్ శివారులోని మైలార్ దేవులపల్లి లో ఓ యువకుడిపై జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే ఓ భూ వివాదం పరిష్కారినికి మైలార్ దేవులపల్లి కింగ్స్ కాలనీలో కొందరు సబావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు వర్గాల మద్య మాటా మాటా పెరగడంతో కొందరు దుండగులు ముస్తఫా అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో యువకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు తీవ్ర రక్త స్రావంతో పడివున్న అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred