ఈ ఫోటొలో గోడ మీద గురి పెట్టిన పెద్ద మనిషి ఒక కేంద్ర మంత్రి. ఆయన ఎంత దూరం ప్రయానించాడో తెలియదు,ఎంత సేపుబిగపట్టుకున్నాడో తెలియదు... ఇలా రోడ్డ మీద కాన్వాయ్ అపేసి, గోడ మీద గురిపెట్టి... ఇలా తేలికపడ్డారు. అంతదాకా బాగానే ఉంది, స్వచ్ఛ భారత్ పేరుతో జాతీయ ఉద్యమంలాగా శుభ్రత సాధించేందుకు కేంద్రం,రాష్ట్రాలు కష్టపడుతున్నపుడు ఒక కేంద్ర మంత్రి ఇలా చేయడం న్యాయమా?

ఈ ఫోటొలో గోడ మీద గురి పెట్టిన పెద్ద మనిషి ఒక కేంద్ర మంత్రి. ఆయన ఎంత దూరం ప్రయానించాడో తెలియదు,ఎంత సేపుబిగపట్టుకున్నాడో తెలియదు... ఇలా రోడ్డ మీద కాన్వాయ్ అపేసి, గోడ మీద గురిపెట్టి... ఇలా తేలికపడ్డారు. అంతదాకా బాగానే ఉంది, స్వచ్ఛ భారత్ పేరుతో జాతీయ ఉద్యమంలాగా శుభ్రత సాధించేందుకు కేంద్రం,రాష్ట్రాలు కష్టపడుతున్నపుడు ఒక కేంద్ర మంత్రి ఇలా చేయడం న్యాయమా?
ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇపుడు వైరల్గా మారి చక్కర్లు కొడుతూ ఉంది.
బీహార్ రాష్ట్రం మోతిహరిలో తిరుగుతూన్నపుడు మంత్రి వర్యులు ఇలా బహిరంగానే ఈ పని చేశారు. అయిన వాళ్లే ఎవరో ఈ ఫొటోలు, ఈ వీడియో ప్రపంచానికి అందించారు. అది సోషల్ మీడియాలో కెళ్లింది.
ఆ మంత్రి ఈ ఘనకార్యం నిర్వహిస్తున్నపుడు సెక్యూరిటీ గార్డుల కాపలా.ఇంతకీ ఈ మంత్రి ఎవరో తెలుసా...
కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్ సింగ్...
