Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలకు నోటీసులు

two mlas get notices on cricket betting cases

 

two mlas get notices on cricket betting cases

 చాలా రోజులుగా నెల్లూరు జిల్లా ను కుదిపేస్తున్న క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్ద‌రుఎమ్మెల్యేల‌కు పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. ఈమేర‌కు  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోట‌మ్‌రెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటి అనిల్ కుమార్ యాదవ్ ల‌కు నోటీసులు ఇచ్చారు. సెక్ష‌న్ 160 కింద వీరిద్ద‌రు విచార‌ణ‌కు రావాల‌ని పోలీసులు సూచించారు. ఈ కేసులో ప్రధాన బుకీ క్రిష్ణ సింగ్, 15 మంది సబ్ బుకీలతో పాటు మొత్తం 115 మందినిపోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది అనుమానితులు పరారీ లో ఉన్నారు. క్రిష్ణ సింగ్ అకౌంట్ నుంచి డబ్బు కొంతమంది ఎమ్మెల్యేల అకౌంట్ల కు బదిలీ అయిందని, ఇందులో ఒకరిద్దరుఎమ్మెల్యేలున్నారని ఆ మధ్య వార్తలు వెలువడ్దాయి. అపుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దీని మీద వివరణ కూడా ఇచ్చారు. ఇపుడు శ్రీధర్ తో పాటు, అనిల్ కుమార్ కు  నోటీలు అందాయి.వీరిద్దరు వైసిపి ఎమ్మెల్యేలు.

Follow Us:
Download App:
  • android
  • ios