Asianet News TeluguAsianet News Telugu

వాళ్లంతా మనోళ్లే, అన్నివిధాల కావలసినోళ్లే...

ప్రపంచం చాలా చిన్నదండి... తరిచిచూస్తే మనమంతా అయిన వాళ్లమే అవుతాం. ఎలాగో చదవండి

The friends circle of chandrababu Naidu

 

విషయం సూటిగాచెబితే...ఐటి దాడులతో వార్తల్లో కెక్కిన తమిళనాడు  ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రామ్మోహన్ రావుమనోడే, తెలుగువాడు. మనకు బాగా దగ్గరి వాడు. పక్కనే   ప్రకాశం జిల్లాకు చెందిన వాడు.

 

ఆయనెవరో కాదు, తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితుడూ, బతికున్నపుడు పార్టీకి (కాంగ్రెస్ కు కూడా) చిత్తూరు జిల్లాలో కొండంత అండగా  ఉండి, టిటిడి బోర్డు ఛెయిర్మన్ గా పనిచేసిన అదికేశవులు నాయుడికి బంధువు. ఆదికేశవులు నాయుడు తెలుగుదేశం ఎంపిగా ఉండేవారు.  అదికేవులు నాయుడి తమ్ముడి పేరు బద్రి నారాయణ. బద్రినారాయణ గారు,రామ్మోహనరావు వియ్యంకులు. బద్రినారాయణ వదిన , ఆదికేశవులు నాయుడు భార్య సత్యప్రభ ఇపుడు టిడిపి ఎమ్మెల్యే.

 

రామ్మోహన్ రావు ఆర్థిక, రాజకీయ అక్రమాలను వెలికితీసేందుకు ఇటి అధికారులు చాలాచోట్ల  దాడులు చేశారు. అందులో భాగంగానే చిత్తూరు లోని బద్రినారాయణఇంటిమీద కూడా దాడులు జరిగాయి.

 

 రెండు నెలల క్రితం ఆదికేశవులు నాయుడు సతీమణి, చిత్తూరు ఎంఎల్‌ఏ సత్యప్రభ ఇంట్లోనూ కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆదాయ పన్ను శాఖాధికారులు సోదా చేసిన విషయం విదితమే. భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అపుడు రు. 265 కోట్ల లెక్కల్లేని డబ్బు దొరికిందట.  ప్రస్తుతం బద్రీనారాయణ ఇంట్లో చెన్నయి కి చెందిన ఆదాయ పన్ను శాఖాధికారులు సోదా చేశారు.

 

ఆరుగురు అధికారులున్న బృందం చిత్తూరు లక్ష్మీనగర్‌ కాలనీలోని ఇంట్లో సోదా చేశారు. రాత్రి వరకూ తనిఖీ చేశారు. కీలక పత్రాలను, భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం డబ్బు తూచే, మిషన్లను ఐటి అధికారులు బద్రినారా యణ ఇంట్లోకి తీసుకెళ్లారు. బద్రీనారాయణ టిడిపిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీటమ్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.

 

తాజా సమాచారం ప్రకారం ఈ బృందంలో శేఖర్ రెడ్డి సభ్యలే నంటున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారి  మిత్రుడు, మాజీ టిటిడి సభ్యుడు,తమిళనాడు కంట్రాక్టర్ అయిన  శేఖర్ రెడ్డి ఇంట్లో కట్టకట్టలకు కట్టలు  కొత్త నోట్లు దొరికాక చాలా మంది కి ఒక ప్రశ్న వచ్చింది.

 

విజ్ఞులు సమాధానం కూడా చెప్పారు. అదేమిటంటే, ఎవరి రికమెండేషన్ తో బాబు శేఖర్ రెడ్డికిశ్రీవారి సేవాభాగ్యం కల్గించి ఉంటాడు అని. జవాబు : కొందరేమో జయలలిత ఫోన్  చేసుంటుందని,మరికొందరు పన్నీర్ సెల్వం అని ఇలా చెపుకుంటూ పోయారు. అయితే, ఎవరో చెప్పాల్సిన పనిలేదు, ఎవరో చెబితే చేసేవాడు కాదు.  అంత డబ్బున్న శేఖర్ రెడ్డి బాబుగారికి స్వయాన ఆత్మీయుడేనని చెప్పేందుకు చాలా అధారాలుకనిపిస్తున్నాయి.

 

 శేఖర్ రెడ్డి గురించి బాబు నోరు మొదపకపోవడానికి కారణం.  ఒక పెద్దాయన ఇలా చెప్పారు. శేఖర్ రెడ్డి మీద బాబు మౌనం వీడితే, శేఖర్ రెడ్డి కూడా మౌనం వీడతాడు... అపుడేమవుతుందో వూహించు అని ఆయన అడిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios