పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
- పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
- 2018 మార్చి 15వ తేదీ నుంచి 29 వరకు పరీక్షలు
2017-18 సంవత్సరానికి సంబంధించి పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విడుదల చేశారు. 2018 మార్చి 15వ తేదీ నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,36,831 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మొత్తం 11,624 పాఠశాలల నుంచి 3,08,834 మంది బాలురు, 3,27,997 మంది బాలికలు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందుకు 2850 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.