నూలు వస్త్ర ధారణ సందేశం పాటించాలని నిర్ణయం
లండన్తెలంగాణా ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినాన్ని కేక్ కట్ చేసి చప్పట్లు కొట్టే రోటీన్ సెలెబ్రేషన్ గా కాకుండా సందేశాత్మకంగా, ఒక సామాజిక కార్యక్రమంగా నిర్వహించారు. మరొక విశేషమేమిటంటే, దీనితో ఈ కార్యక్రమం రాజకీయాతీతం అయింది. చాలా మందిని ఆకట్టు కుంది.
లండన్ లో కెసిఆర్ జన్మదిన(ఫిబ్రవరి 17) వేడుకలు అక్కడి ప్రజలకు అనుకూలంగా ఉండేలా మూడు రోజులు ముందుగానే ‘కెసిఆర్ మరియు తెరాస సపోర్టర్స్ అఫ్ యూకే’ఆధ్వర్యం లో (KCR & TRS supporters of UK) జరిగాయి.
ఏజ్ లింక్అనే వృద్ధుల సేవా సంఘం, ఓపెన్ హార్ట్ సేవ సంఘంతో ఈ సంఘాల సభ్యులు చేతులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు .#wearhandloom , వారానికొకసారైన చేనేత వస్త్రాలను ధరించండి అన్న ఎన్ ఆర్ ఐ మంత్రి కెటి రామారావు పిలుపును ఈ రోజు ఆచరణ లో పెట్టారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నుంచి తెప్పించిన నూలు వస్త్రాలను కోర్ కమిటి సభ్యులు ధరించి, ఈ నినాదానికి పూర్తి మద్ధతు ప్రకటించారు. ఈ నినాదాన్ని లండన్ లో ఉన్న తెలుగువారందరిదగ్గరకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సంస్థల వ్యవస్థాపకులు సిక్కా చంద్ర శేఖర్ ఏషియానెట్ కు తెలిపారు.
భాస్కర్ పిట్టల సభ అధ్యక్షన జరిగిన ఈ కార్య క్రమం లో సుమారు 80 మంది వృద్దులు పాల్గొన్నారు మొదటి తరం సబంధించిన సిరిందెర్ పురేవాల్ (హెస్టన్ కౌన్సిల్) పాల్గొన్నారు
పాశ్చాత్య దేశాలలో వృద్ధులను చాల ఒంటరినితనం వేధిస్తుందని, ఈ స్థితిలో వారికి ఆత్మస్థయిర్యం కల్గించడం అవసరమని వారు నొక్కి చెప్పారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా వారికి మెడిటేషన్ ,సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహం నింపడమే కాకుండా హైదరాబాద్ బిర్యానీరుచిని ,పసందయిన తెలంగాణవంటకాలను ఈ ఆంగ్లేయులకు పరిచయం చేశామని చంద్రశేఖర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చాలా సేపు తమతో కలసిమెలసి ఉన్నందుకు కార్యక్రమానికి వచ్చిన పెద్ద వారంతా మెలసి ఉన్నందుకు ఎంతో ఆనందించారని, కెసిఆర్ గారికి శుభాకాంక్షలు తెలిపారని సంస్థ సభ్యులుసురేష్ గోపతి అన్నారు .
“ కెసిఆర్ జన్మదినం కేవలం జన్మదిన వేడుక కాదు అది యాత్ తెలంగాణ పండుగ. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కంటే యువతకు మరియు మాలాంటి ప్రవాస భారతీయులకు ఒకస్ఫూర్తి దాత. అందరికి అందుబాటులో ఉండాలని ఈ కార్యక్ర మాన్ని ముందుగానే నిర్వహిస్తున్నాం,” అని కాసర్ల నగేష్ రెడ్డి, వెంకట్ రంగుతెలిపారు .
కెసిఆర్ జన్మదిన వేడుకలను తెరాస పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమం గా కాకుండా ప్రజల కార్యక్రమం గ నిర్వహించాలని, వారి ఉద్యమ స్ఫూర్తి రాబోయే తరాలవారికి తెలియచేయాలి అనే ఒకే ఒక నినాదం తో ఈ వేడుకలు చేస్తున్నామనినరేష్ కుమార్ మరియు జయంత్ నార్పరాజు తెలిపారు .
అహింసా మార్గాన 4 కోట్ల మంది కి న్యాయం చేసిన వ్యక్తి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషమని ప్రముఖ సంఘ సేవకులు డాన్ జూన్సన్తెలిపారు .
ఈ స్వచ్చంద కారిక్రమాలకి ఎంతో సంతోషించిఏజ్ లింక్ సభ్యులు కూడాతెరాస కండువాలు కప్పుకొనిజయధ్వానాలుద్వారా తమ గౌరవం చాటారని ప్రమోద్ అంతటి భాస్కర్ మోతీ తెలిపారు.
జన్మదిన సందర్భం గ తెలంగాణ లో ఎన్నో సేవ కారిక్రమాల కు శ్రీకారం చుట్టబోతున్నట్లు కాన్ఫరెన్స్ ద్వారా గోలి తిరుపతితెలియజేసినారు .
ఈ కార్యక్రమం లో వివిధ దేశాలకు చెందిన వృద్ధ సంఘ సేవకులు తో కలిపి కోర్ టీం సభ్యులు సంతోష్ ఆకుల ,హరిబాబు గౌడ్ , తో పాటు శిరీష చౌదరి ,శ్రీలక్ష్మి నాగులబండి ,, రమాదేవి ,జ్యోతి రెడ్డి ,ప్రీతీ నోముల ,వాణి అనుసరి ,స్వప్న , అమీరహ్ ,గ్రాహం బేకర్ ,రిచర్డ్ సిషన్ ,డీన్ క్యారీ ,సాలీ హౌగ్ ,అనిల్ పాండే ,పార్థ ముడూర్ , వాలంటీర్లు గా పనిచేసినవారి లో ఉన్నారు .
