ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై
- కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై
- ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో అమలు
- వచ్చే మార్చి నాటికీ అన్ని బస్సుల్లో ఉచిత వైఫై
కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తున్నది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 200 ఆర్టీసీ బస్సుల్లో అమలు చేయగా.. రానున్న మార్చి నెల నాటికి అన్ని ఆర్టీసీ బస్సుల్లో అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రేవన్న అధికారికంగా తెలియజేశారు.
ఉచిత వైఫై కి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మంత్రి రేవన్న చెప్పారు. ప్రయోగాత్మకంగా 200 బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేశామని.. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమలు చేస్తామన్నారు. ఈ కాంట్రాక్టును కేపీఐటీ అనే సంస్థకు అప్పగించామని ఆయన వివరించారు. వచ్చే మార్చి నాటికి అన్ని కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై అందిస్తామని మంత్రి తెలిపారు.