Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ లో మరో భారతీయుడిపై కాల్పులు

కెంట్‌ నగరంలో ఓ తెల్లజాతీయుడు దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తి (39) పై కాల్పులకు దిగాడు.

Sikh shot in US by man yelling go back to your own country

అమెరికాలో జాతి విద్వేశం బుసలు కొడుతోంది. భారతీయులే టార్గెట్ గా అక్కడి స్థానికులు రెచ్చిపోతున్నారు.

 

తెలుగువ్యక్తి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ను కన్సాస్ లో ఓ తెల్లజాతీయుడు దారుణంగా కాల్చిచంపిన ఘటన మరవక ముందే రెండు రోజుల కిందట మరో భారతీయుడిని అక్కడి వారు పొట్టన పెట్టుకున్నారు.  

 

అమెరికాలో సూపర్ మార్కెట్ ను నడుపుతున్న హర్నీష్‌ పటేల్‌ను కూడా జాతి విద్వేశంతోనే చంపారు. ఈ రెండు ఘటనల నుంచి భారత్ కోలుకోకముందే మరో దారుణం చోటుచేసుకుంది.

 

గత శుక్రవారం రాత్రి వాషింగ్టన్‌ రాష్టంలోని కెంట్‌ నగరంలో ఓ తెల్లజాతీయుడు దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తి (39) పై కాల్పులకు దిగాడు. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ అతడు ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలిసింది.

 

ఈ ఘటనలో దీప్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios