యూఎస్ లో మరో భారతీయుడిపై కాల్పులు
కెంట్ నగరంలో ఓ తెల్లజాతీయుడు దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తి (39) పై కాల్పులకు దిగాడు.
అమెరికాలో జాతి విద్వేశం బుసలు కొడుతోంది. భారతీయులే టార్గెట్ గా అక్కడి స్థానికులు రెచ్చిపోతున్నారు.
తెలుగువ్యక్తి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ను కన్సాస్ లో ఓ తెల్లజాతీయుడు దారుణంగా కాల్చిచంపిన ఘటన మరవక ముందే రెండు రోజుల కిందట మరో భారతీయుడిని అక్కడి వారు పొట్టన పెట్టుకున్నారు.
అమెరికాలో సూపర్ మార్కెట్ ను నడుపుతున్న హర్నీష్ పటేల్ను కూడా జాతి విద్వేశంతోనే చంపారు. ఈ రెండు ఘటనల నుంచి భారత్ కోలుకోకముందే మరో దారుణం చోటుచేసుకుంది.
గత శుక్రవారం రాత్రి వాషింగ్టన్ రాష్టంలోని కెంట్ నగరంలో ఓ తెల్లజాతీయుడు దీప్ రాయ్ అనే సిక్కు వ్యక్తి (39) పై కాల్పులకు దిగాడు. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ అతడు ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలిసింది.
ఈ ఘటనలో దీప్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.