గడ్డం పెంచొద్దని కోర్టు తీర్పు
- నేవీ ఫోర్స్ కు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
మత విశ్వాసాల పేరుతో ఇండియన్ నేవీలో పనిచేస్తున్న ఉద్యోగులు గడ్డాలు పెంచరాదని సుప్రీంకోర్టు ఈ రోజు తన తీర్పులో స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. గడ్డం పెంచరాదని ఆదేశాలు జారీ చేయడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కాదని పేర్కొంది.
ధర్మాసనంలో ఠాకూర్ తో పాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర్రావు కూడా సభ్యులుగా ఉన్నారు.
మొహమ్మద్ జుబైర్, అన్సారీ అఫ్తాబ్ వేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
భారత వైమానిక దళంలో పనిచేస్తున్న ఈ ఇద్దరూ ఢిల్లీ కోర్టులో మొదట పిటిషన్ వేశారు.