కోర్టుకు సల్మాన్అక్టోబర్ 5కు వాయిదా
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈరోజు కోరుట ఎదుట హాజరయ్యారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో జోధ్పూర్ సెషన్స్ కోర్టు సల్మాన్కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈకేసు వాదనను న్యాయస్థానం అక్టోబర్ 5కు వాయిదా వేసింది. కాగా..సల్మాన్ కేవలం రూ.20వేల విలువైన బెయిల్ బాండ్ ను దాఖలు చేసేందుకే కోర్టుకు వచ్చాడని , ఏ విధమైన హియరింగ్ లేదని ఆయన తరపు న్యాయవాది హస్తిమల్ సారస్వత్ వెల్లడించారు. గతంలోనూ కృష్ణజింకను చంపిన కేసు, హిట్ అండ్ రన్ కేసులోనూ సల్మాన్ పలుమార్లు కోర్టు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
