స్పైసీ బావర్చిలో దారుణం.. టిప్పు కోసం ప్రాణం తీశారు ( video)
కస్టమర్ ఇచ్చిన రూ.30 కోసం ఇద్దరు వెయిటర్లు కొట్టుకున్నారు. అందులో ఒకరు మరణించారు.
30 రూపాయిలు ఓ నిండు ప్రాణాన్ని బలగొంది. హైదరాబాద్ పాతబస్తీలోని స్పైసీ బావర్చిలో దారుణం చోటు చేసుకుంది.కస్టమర్ ఇచ్చిన టిప్ తనకంటే తనకే నని ఇద్దరు వెయిటర్లు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
ఈ దాడిలో ఉత్తరప్రదేశ్కు చెందిన రాజు సృహతప్పి పడిపోయాడు. అతడితో గొడవపడిన కమలేష్ అనే వెయిటర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.