రూ.999 కే జియో ఫోన్
- అతి తక్కువ ధరకే 4 జి ఫోన్లు తీసుకొచ్చేందుకు సిద్దమవుతున్న రిలయెన్స్
రిలయెన్స్ జియో దేశ టెలికాం రంగంలోనే ఓ సంచలనం. ఫ్రీ కాల్స్ తో అడుగుపెడుతూనే పోటీదారుల గుండెల్లో గుబులు రేపింది.
ఇప్పటి వరకు ఫ్రీ కాల్స్ తోనే సరిపెట్టిన జియో ఇప్పుడు మరో భారీ ఆఫర్ తో టెలికాం రంగంలో రికార్డును సృష్టించబోతోంది.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు 4జీ వోల్ట్(వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) సదుపాయం ఉన్న ఫీచర్ఫోన్లను అతి తక్కువ ధరకే విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
రూ.999 నుంచి రూ.1500 మధ్యలో రెండు రకాల 4జీ వోల్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
అయితే ఈ ఫోన్లు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ప్రస్తుతం 4జీ వోల్ట్ సదుపాయం ఉన్న స్మార్ట్ఫోన్ల ధర రూ.3500 నుంచి ఉంది.