ఆఫర్ మార్చి వరకు ఉంటుందని స్పష్టం చేసిన రిలయెన్స్
జియో వినియోగదారులకు శుభవార్త. మార్చి వరకు జియో ఆఫర్ పొడగించడంపై పోటీ టెలికాం సంస్థలు ట్రాయ్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫర్ కట్ అవుతుందేమోనని చాలా మంది భావించారు.
అయితే దీనిపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ క్లారిటీ ఇచ్చారు. జియో తాజా ఫ్రీ వాయిస్ డేటా ఆఫర్ లో ఎలాంటిని నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు.
ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రాయ్ నిబంధనలను ఉల్లఘించలేదని ప్రకటించారు. ప్రమోషనల్ ఆఫర్ ముగిసిందని అయితే మార్చి వరకు ఇస్తున్న ఆఫర్ దీనికి పొడగింపు కాదని తెలిపారు.
తమ వినయోగదారులకు కొత్త సంవత్సరకానుకగా మార్చి వరకు మరో ఆఫర్ ఇస్తున్నామని దానికి ప్రారంభ ఆఫర్ కు సంబంధంలేదని స్పష్టం చేశారు.
వచ్చే జనవరి 1 నుంచి మార్చి వరకు జియో కొత్త ఆఫర్ ఉంటుందన్నారు.
డిసెంబర్ 20న ట్రాయ్ రాసిన లేఖకు వివరణగా రిలయన్స్ యాజమాన్యం ఈ వివరణ ఇచ్చింది.
ట్రాయ్ నిబంధనలకు లోపబడే 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలిపింది.
