రాష్ట్రపతి ఇంకా ప్రణబ్ ముఖర్జీయే.. రాష్ట్రపతి భవన్ ప్రెస్ నోట్
రాష్ట్రపతి భవన్ ప్రెస్ నోట్ లో అచ్చు తప్పు. రాష్ట్రపతి ఇంకా ప్రణబ్ ముఖర్జీయే
రాష్ట్రపతి భవన్ ప్రెస్ నోట్ లో అచ్చు తప్పు. రాష్ట్రపతి ఇంకా ప్రణబ్ ముఖర్జీయే. ఈ రాత్రి 8.40 గంటలకు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హిమాచల్ కొండచరియల విరిగిన పడిన ప్రమాదం మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు పేర్కొన్నారు. అలవాటులో పొరపాటు. రామ్ నాథ్ కోవింద్ పదవీ బాధ్యతలు స్వీకరించిచాలా రోజులయినా, ఆయన పేరుతో పత్రికా ప్రకటనలు విడుదల వుతున్నా, పాత అలవాటు చటుక్కున తలెత్తి చూసింది. ఈ ప్రెస్ నోట్ రాసిన అధికారి మరొక ఆలోచనే లేకుండా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అని రాసి నోట్ ను రాష్ట్రపతి భవన్ లో పోస్టు చేశారు. ఇది రాత్రి తొమ్మదిన్నర దాకా అలాగే ఉంది.
ఇదే ప్రెస్ నోట్...