Asianet News TeluguAsianet News Telugu

అన్నం కాదు, టిడిపి నేతలు ఇసుక, మట్టి మేస్తున్నారు

టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనపై ‘‘దోపిడిబాబు’’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒక ఛార్జ్ షీట్ బుక్ ను విడుదల చేసింది. విజయవాడలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ఈ బుక్ లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ నేతలు అన్నం తినడం మానేసి ఇసుక, మట్టి మాత్రమే తింటున్నారని అన్నారు. 

raghuvira says TDP leader are eating sand and land instead of meals

టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనపై ‘‘దోపిడిబాబు’’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒక ఛార్జ్ షీట్  ను విడుదల చేసింది. విజయవాడలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ఈ బుక్ లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో   టీడీపీ నేతలు అన్నం తినడం మానేసి ఇసుక, మట్టి మాత్రమే తింటున్నారని అన్నారు.రాష్ట్రంలో ఇసుక కుంభకోణాలు, భూకబ్జాల కుంభకోణాలు తప్ప పరిపాలన అనే సాగడం లేదని ఆయన ఆరోపించారు.

 

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లానుంచి ఈ ఇసుక మేత మొదలవుతున్నదని ఆరోపిస్తూ,దీనివల్ల రాష్ట్ర సంపద పోవడమే  కాదు,అమాయక ప్రజలు ప్రాణాలు కూడా పోతున్నాయని రఘువీరా చెప్పారు.అన్ని రకాలుగా ఆంధ్రలో దోపిడీ జరగుతున్నదని చెబుతూ చివరకు కమిషన్ల కోసం ప్రాజక్టుల వ్యయం కూడా ఇష్టానుసారం పెంచేస్తున్నారని ఆయన విమర్శించారు.

 

‘‘రాష్ట్రం లోని 34 వేల కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు లను 76 వేల కోట్ల కు పెంచి క్యాబినెట్ నిర్ణయం తో అవినీతి కి పాల్పడ్డారు..టిడిపి  మంత్రులే భూదందా లకు పాల్పడి రోడ్లపై నే కొట్టుకుంటున్నారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వృధా  చేశారు,’’ అని ఆయన అన్నారు.

 

రఘువీరా రెడ్డి లేవనెత్తిన మరి కొన్ని అంశాలు: 

 

అనినీతి,దోపిడీ, ఆరాచకాలలో టీడీపీ ప్రభుత్వం నంబర్ వన్ గా నిలిచింది, ఇది కూడా రికార్డే

సీఎం సొంత నియోజక వర్గంలో కూడా ఇసుక మాఫియా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతోంది

హుద్ హుద్ తుపాను వంటి విపత్హులను కూడా అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారు

ఆర్టీవో లను రెవిన్యూ మినిస్టర్ కాకుండా సీఎం చంద్రబాబు మాత్రమే ఎందుకు ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు

చివరకు ఎమ్మార్వో  ల బదిలీలు సైతం చినబాబు కొరికతో పెద్దబాబు చేస్తున్నారు

దీని ఫలితమే విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణం

ముఖ్యమంత్రే స్వయంగా అవినీతికి పాల్పడుతున్నారు

బాబోస్తే జాబన్నారు, చివరకు కొడుక్కి మాత్రమే ఉద్యోగమిచ్చారు

వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతోంటే ఒక్కరికైనా 5 లక్షల పరిహారం ఇచ్చారా

రైతులకు మద్దతు ధర ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది

తమకు గిట్టనివారిని ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేతలు హత్యలు చేస్తున్నారు

 

Follow Us:
Download App:
  • android
  • ios