సెంచరీతో సత్తా చాటినా పుజారా
- సెంచరీ చేసిన పుజారా.
- ధావన్ 190 పురుగులకు అవుట్.
- కోహ్లి 3 పరుగులకే వెనుదిరిగాడు.
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో ఇండియా భారీ స్కోర్ పై కన్నేసింది. తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు సాధించిన శిఖర్ ధావన్. మరో స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా సత్తా చాటాడు. నిలకడగా ఆడి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం పుజారా 201 బంతులాడి 116 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరో ఎండ్ లో రహానే 17 పరుగులతో ఆడుతున్నాడు. భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 345 పరుగులు. భారత్ మూడు వికెట్లను శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ తీయడం విశేషం. ఇండియా నిలకడగా ఆడుతుంది.