Asianet News TeluguAsianet News Telugu

బంగారు దొంగల సెల్ ఫోన్ దొరికింది

  • మంగళవారం రాత్రి విజయవాడలోని ఒక నగల తయారీ సెంటర్లో చొరబడిన దొంగలు
  • దాదాపు ఏడు కిలోల నగలతో పరారీ
  • పోలీసులకు చిక్కిన కీలకమయిన వస్తువు
  • గుంటూరుమిర్చియార్డు వద్ద మొబైల్ ఫోన్ వదలివేసిన దొంగలు
police found vijayawada burglers mobile in Guntur

గుంటూరు: బీసెంట్‌రోడ్‌లోని ఒక నగల తయారీ కేంద్రంలో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి కీలకసమాచారం దొరికింది.

 

 దోపీడికీ పాల్పడ్డ వ్యక్తులు గుంటూరు మిర్చియార్డు వద్ద కారులో సెల్‌ఫోన్‌ వదిలి వెళ్లారు. దర్యాప్తులో ఈ సెల్‌ ఫోన్‌ సమాచారమే కీలకం కానుంది.

 

సెల్‌ఫోన్‌ కాల్‌ రిజిస్టర్‌ తనిఖీ  చేసి పోలీసులు దర్యాప్తు ప్రాంభించారు. మొత్తం 8 పోలీసుల బృందాలు దోపిడీ దొంగల కోసం చుట్టు పక్కల  గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తులమీద, అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిపై పోలీసులుప్రత్యేక నిఘా ఉంచారు.

 

 దోపిడీ దొంగలు ఒక కారులో బంగారు నగలతో తాడేపల్లి -డోలాస్‌నగర్‌ మీదుగా పరారైనట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనం గత రాత్రి పదిగంటలపుడు జరిగింది. సుమారు 7 కిలోల బంగారు నగలతో దొంగలు పరారయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios