బంగారు దొంగల సెల్ ఫోన్ దొరికింది
- మంగళవారం రాత్రి విజయవాడలోని ఒక నగల తయారీ సెంటర్లో చొరబడిన దొంగలు
- దాదాపు ఏడు కిలోల నగలతో పరారీ
- పోలీసులకు చిక్కిన కీలకమయిన వస్తువు
- గుంటూరుమిర్చియార్డు వద్ద మొబైల్ ఫోన్ వదలివేసిన దొంగలు
గుంటూరు: బీసెంట్రోడ్లోని ఒక నగల తయారీ కేంద్రంలో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి కీలకసమాచారం దొరికింది.
దోపీడికీ పాల్పడ్డ వ్యక్తులు గుంటూరు మిర్చియార్డు వద్ద కారులో సెల్ఫోన్ వదిలి వెళ్లారు. దర్యాప్తులో ఈ సెల్ ఫోన్ సమాచారమే కీలకం కానుంది.
సెల్ఫోన్ కాల్ రిజిస్టర్ తనిఖీ చేసి పోలీసులు దర్యాప్తు ప్రాంభించారు. మొత్తం 8 పోలీసుల బృందాలు దోపిడీ దొంగల కోసం చుట్టు పక్కల గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తులమీద, అనుమానాస్పదంగా తిరుగుతున్నవారిపై పోలీసులుప్రత్యేక నిఘా ఉంచారు.
దోపిడీ దొంగలు ఒక కారులో బంగారు నగలతో తాడేపల్లి -డోలాస్నగర్ మీదుగా పరారైనట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనం గత రాత్రి పదిగంటలపుడు జరిగింది. సుమారు 7 కిలోల బంగారు నగలతో దొంగలు పరారయ్యారు.