వాహనదారులకు షాక్
- వాహనదారులకు భారీ షాక్
- ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేత
- మే14 నుంచి అమలులోకి
ఇక నుంచి ప్రతి శనివారం బైక్, కారుల్లో పెట్రోల్ ఉందో లేదో ముందే చూసుకోవాలి. లేకుంటే మళ్లీ సోమవారం వరకు ఇందనం దొరకదు. ఎందుకంటే.. ఇక నుంచి ఆదివారం రోజు పెట్రోల్ బంకులు మూసివేయనున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ నిబంధన అమలులోకి రానుంది.
పెట్రోల్ వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ పెట్రోలియం డీలర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మే 14వ తేదీ నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ పంపులు తెరుచుకోవన్నారు. 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పుదుచ్చెరి, మహారాష్ట్ర, కేరళ ఉన్నాయి.