వాహనదారులకు భారీ షాక్ ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేత మే14 నుంచి అమలులోకి

ఇక నుంచి ప్రతి శనివారం బైక్, కారుల్లో పెట్రోల్ ఉందో లేదో ముందే చూసుకోవాలి. లేకుంటే మళ్లీ సోమవారం వరకు ఇందనం దొరకదు. ఎందుకంటే.. ఇక నుంచి ఆదివారం రోజు పెట్రోల్ బంకులు మూసివేయనున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ నిబంధన అమలులోకి రానుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పెట్రోల్ వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ పెట్రోలియం డీలర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మే 14వ తేదీ నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ పంపులు తెరుచుకోవన్నారు. 8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పుదుచ్చెరి, మహారాష్ట్ర, కేరళ ఉన్నాయి.