విజయవాడ ఆటోనగర్   కె-బిజినెస్ స్పేస్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్  ఐటి శాఖ మంత్రి  నారా లోకేష్ 7 ఐటి కంపెనీలను ప్రారంభించారు. ఈఏ లెర్న్,సుప్రీమ్ నెట్ సాఫ్ట్,క్రిసాల్ ఇన్ఫో సెర్వ్,డిఆర్ కంప్యూటర్, ఇన్ స్పైర్ ల్యాబ్స్,ఎన్వీరా,స్టెయిన్ మెట్జ్ కంపెనీల ద్వారా తక్షణం 4 వందల ఐటి ఉద్యోగాలు రాష్ట్ర యువకులకు లభిస్తాయని  ఆయన చెప్పారు.

విజయవాడ ఆటోనగర్ కె-బిజినెస్ స్పేస్ లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ 
7 ఐటి కంపెనీలను ప్రారంభించారు. ఈఏ లెర్న్,సుప్రీమ్ నెట్ సాఫ్ట్,క్రిసాల్ ఇన్ఫో సెర్వ్,డిఆర్ కంప్యూటర్, ఇన్ స్పైర్ ల్యాబ్స్,ఎన్వీరా,స్టెయిన్ మెట్జ్
కంపెనీల ద్వారా తక్షణం 4 వందల ఐటి ఉద్యోగాలు రాష్ట్ర యువకులకు లభిస్తాయని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చెప్పారు.గతంలో మేధా టవర్స్ లో కూడా ఏడు కంపెనీలను ప్రారంభించిన విషయం చెబుతూ ఈ రెండు కలిపితే, దాదాపు 3000 వేల ఉద్యోగాలు లభించాయని చెప్పారు. మొత్తంగా 90 రోజులలోనే మూడు వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత నతెలుగుదేశం ప్రభుత్వానిదే నని లోకేశ్ అన్నారు.