సిద్దిపైట పీహెచ్సీలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ
- సిద్దిపేట పీ హెచ్ సి లో హరిష్ ఆకస్మిక తనిఖీ
- సమయ పాలన పాటించని డాక్టర్లపై చర్యకు ఆదేశం
సిద్దిపేట: జిల్లాలోని నంగనూరులోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. కాగా... మంత్రి వెళ్లిన సమయానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాని వైద్యులకు, సిబ్బందికి చార్జ్మెమో ఇవ్వాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.