ఐసీయూలో క్షుద్ర పూజలు (వీడియో)
- పూణేలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జరిగిన వింత తెలిసి దేశం ఆశ్చర్యపోతోంది
- అక్కడి దీనానాధ్ మంగేష్కర్ ఆసుపత్రిలో పాతికేళ్ళ సంధ్యా సోనావానే అనే మహిళ అనారోగ్యంతో చేరింది
- ఐసీయూ లో ఉన్న ఆమె మృత దేహానికి ఓ బాబా అంత్యక్రియలు చేయడం కొసమెరుపు
పూణేలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో జరిగిన వింత తెలిసి దేశం ఆశ్చర్యపోతోంది. అక్కడి దీనానాధ్ మంగేష్కర్ ఆసుపత్రిలో పాతికేళ్ళ సంధ్యా సోనావానే అనే మహిళ అనారోగ్యంతో చేరింది. ఈ నెల 12 న డాక్టర్లు ఆమెకు అన్ని పరీక్షలూ చేశారు. అయితే చికిత్స పొందుతూనే ఆ మరుసటిరోజు ఆమె మరణించింది. కానీ.. ఇక్కడో మలుపు.. ఐసీయూ లో ఉన్న ఆమె మృత దేహానికి ఓ బాబా అంత్యక్రియలు చేయడం కొసమెరుపు.
చవాన్ అనే డాక్టర్ స్వయంగా ఆ బాబాను తీసుకొచ్చి సంధ్యకు అంత్యక్రియలు చేయమని కోరాడట.. ఈ తతంగాన్ని సంధ్య సోదరుడు వీడియో తీశాడు.చవాన్ ఆ బాబాను ఎందుకు తీసుకు వచ్చాడో, అతని ఉద్దేశమేమిటో తమకు తెలియడంలేదని ఆయన చెప్పాడు. అటు-హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈ వ్యవహారం పై నోరు మెదపడంలేదు. అసలీ సంఘటనతో తమకెలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకుంటోంది. ఏమైనా… ఈ వీడియో వైరల్ గా మారింది. సంధ్య మృత దేహంపై ఆ బాబా బ్లాక్ మ్యాజిక్ చేశాడా ? అయినా ఆసుపత్రి ఐసీయూలో ఇలాంటి సంఘటనలు జరగడమేమిటి అంటూ అనేకమంది వేస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు.
A video has gone viral about some rituals being performed on a patient inside ICU in presence of a doctor in #Pune based hospital. @dna pic.twitter.com/uuv5anyg47
— Anurag Bende (@Bendeanurag) March 13, 2018