పాక్ ఇతన్ని ఎప్పుడో చంపేసింది..!
హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ అనుమానాలు
భారత్ మాజీ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ ను పాక్ చంపేసిందా.. ఆ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకే ఇప్పుడు అతడికి మరణశిక్ష విధించినట్లు చెబుతుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఎందుకంటే హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఈ విషయంపై వ్యక్తం చేస్తున్న అనుమానాలు అతడి హత్యను బలపరుస్తున్నాయి.
పాక్ ఆర్మీకి చిక్కిన కుల్ భూషణ్ ను విడుదల చేసేందుకు, అతడితో మాట్లాడేందుకు ఇప్పటి వరకు భారత్ 13 సార్లు ప్రయత్నించిదట. అయినా పాక్ ఈ విషయంలో ఒక్కసారి కూడా స్పందించలేదట. బహుశా కులభూషణ్ను చిత్రహింసలు చేసి చంపేసి ఉండొచ్చని సింగ్ అభిప్రాయపడుతున్నారు.
ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా, తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకే పాక్ ఇప్పుడు ఉరిశిక్ష అంటూ కొత్త నాటకం మొదలుపెడుతోందని ఆయన ఆరోపించారు.
ఇప్పటికైన భారత ప్రభుత్వం పాక్ రాయబార కార్యాలయంతో మాట్లాడి అతడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.