బీఎస్ఎన్ఎల్ రాఖీ కానుక అదిరింది..!
- జియో తాకిడిని తట్టుకునేందుకు అన్ని టెలికాం సంస్థలు తమ వంతు కృషి బాగానే చేస్తున్నాయి
- ‘రాఖీ పే సౌగత్’ అంటు రాఖీ బహుమతి పేరిట ఈ ఆఫర్ ని తీసుకువచ్చింది.
జియో తాకిడిని తట్టుకునేందుకు అన్ని టెలికాం సంస్థలు తమ వంతు కృషి బాగానే చేస్తున్నాయి.ఇందులో భాగంగానే బీఎస్ఎన్ఎల్
( భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) రక్షా బంధన్ ని పురస్కరించుకొని వినూత్న ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకు వచ్చింది. ‘రాఖీ పే సౌగత్’ అంటు రాఖీ బహుమతి పేరిట ఈ ఆఫర్ ని తీసుకువచ్చింది. ఈ ఆఫర్ వర్తించాలటే.. రూ.74తో రీఛార్జ్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే.. 1జీబీ డేటా, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు ఉచితంగా అన్ లిమిటెడ్ నెట్ కాల్స్ చేసుకోవచ్చు. అవి కూడా ఎస్టీడీ.. అండ్ లోకల్ కాల్స్ రెండూ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక ట్వట్టర్ ద్వారా తెలియజేసింది.
ఆగస్టు 3వ తేదీనుం చే ఈ ఆఫర్ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ‘ బంధాలను దూరం ఎప్పటికీ వేరు చేయలేదు.. అన్ లిమిటెడ్ బిఎస్ ఎన్ ఎల్ కాల్స్.. చేసుకోండి ఈ రాఖీ పే సౌగత్ తో’ అంటూ
కంపెనీ ట్విట్టర్ లో పేర్కొంది.