కారు కొంటే ఐటీ నోటీసులు
- నవంబర్ 8 తర్వాత కారు కొంటే ఇక అంతేసంగతులు
పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం ఇచ్చిన షాకుల నుంచి ప్రజలు తేరుకోకముందే మరో షాకిచ్చింది.
నవంబర్ 8 నుంచి దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ రోజు నుంచి ఎవరైనా కారు కొంటే ఇక లెక్కలు సరిచూసుకోవాల్సిందే.
ఇప్పటికే ఐటీ శాఖ నవంబర్ 8 నుంచి కారు కొన్నవాళ్లకు నోటీసులు పంపింది.
దేశంలో కొన్ని కోట్ల మంది ఇలా కారు కొనే ఉంటారు. వారందరికీ నోటీసులు పంపేందుకు ఐటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఐటీ నోటీసులు అందుకున్నవారు ఇక పక్కాగా లెక్కలు చెప్పాల్సిందే. కారు కొనడానికి ఏ రూపంలో డబ్బులు చెల్లించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఇలా సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నోటీసులు అందుకున్న వారందరూ సిద్ధంగా ఉండాల్సిందే.