(video) ప్రధాని దెబ్బకు ఏడుస్తూ వార్తలు చదివిన యాంకర్
ఛానెల్ 1 అనే టీవీలో గ్యులా ఈవెన్ యాంకర్గా పనిచేస్తోంది. ఇజ్రాయిల్ లో 50 ఏళ్ల చరిత్ర ఉన్న వార్తా సంస్థ ఇది. అయితే ఆదేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఈ ఛానెల్ మూసేయాలని ఆదేశించాడు.
భావోద్వేగాలు లేకుండా ఏ పని చేయలేం. అలా చేయాలంటే ఏంతో గుండె నిబ్బరం ఉండాలి.
అలాంటి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించిన చత్తీస్ గఢ్ లోని ఓ యాంకర్ భర్త యాక్సిడెంట్ మరణాన్ని దిగమింగుతూనే వార్తగా చదివి తన వృత్తిధర్మాన్ని నిర్వహించింది.
ఇజ్రాయిల్ చెందిన ఈ యాంకర్ కు అలాంటి సంఘటన ఎదురుకాకపోయినా కాస్త బాధకరమైన విషయాన్నే న్యూస్ బులిటెన్ సమయంలో వినాల్సి వచ్చింది. దీంతో వార్తలు చదువుతూనే కన్నీళ్లు పెట్టుకుంది.
ఛానెల్ 1 అనే టీవీలో గ్యులా ఈవెన్ యాంకర్గా పనిచేస్తోంది. ఇజ్రాయిల్ లో 50 ఏళ్ల చరిత్ర ఉన్న వార్తా సంస్థ ఇది. అయితే ఆదేశ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఈ ఛానెల్ మూసేయాలని ఆదేశించాడు.
ఈ విషయం గ్యులా న్యూస్ బులిటెన్ చదువుతున్నప్పుడే తెలిసింది. అదే వార్తను ప్రజలకు చెప్పాల్సి రావడంతో భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ తమ చానెల్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
https://www.facebook.com/iba.channel11/videos/1552219794810386/