Asianet News TeluguAsianet News Telugu

నెక్లెస్ రైడ్ లో ‘ఇన్ఫినిటీ రైడ్’.. పాల్గొన్న మంచు లక్ష్మి

  • పీపుల్స్ ప్లాజాలో ఈ యాత్రను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సలహాదారు  కోడె దుర్గా ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమానికి సినీ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై.. అథ్లెట్లను ఉత్సాహపరిచారు.
infinity ride at necklace road hyderabad

infinity ride at necklace road hyderabad

హైదరాబాద్ నరంలో ఈరోజు ఉదయం ‘ ఇన్ఫినిటీ రైడ్’ పేరిట సైకిల్ యాత్రను చేపట్టారు. పీపుల్స్ ప్లాజాలో ఈ యాత్రను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సలహాదారు  కోడె దుర్గా ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ను చేపట్టారు. ఈ కార్యక్రమానికి సినీ నటి మంచు లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై.. అథ్లెట్లను ఉత్సాహపరిచారు.

విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కాళ్లూ, చేతులు కోల్పోయిన వారికి ధైర్యం నింపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు.. మెహతా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్రలో  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది పారా అథ్లెట్లతో పాటు బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ విభాగాలకు చెందిన పారా అథ్లెట్‌ క్రీడాకారులు యాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో మొదలైనఈ  యాత్ర ఆగస్టు 15న తిరుపతికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఆర్ పీఎఫ్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, ఫిట్ నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios