భారత్ టార్గెట్ 171 పరుగులు. మూడు వికెట్లతో రాణించిన చాహాల్.

 భారత్, లంకకి మధ్య జ‌రుగుత‌న్న‌ ఏకైక టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. మొదట చాహాల్ అద్బుతమైన బౌలింగ్ తో లంక బ్యాట్స్‌మెన్ల‌ను పెవిలియ‌న్ బాట ప‌ట్టించాడు. చాహాన్ మూడు వికెట్లు తీశాడు. కానీ చివర్లో లంక బ్యాట్స మెన్లు రాణించడంతో 170 పరుగులకు 7 వికట్లు కోల్పోయి గౌవ‌ర‌ప్ర‌ద‌మైన స్కోర్ చేయ‌గ‌ల్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన లంక మొదటి నుండి తడబాటు ప్రదర్శించింది. లంక బ్యాట్స్‌మెన్స్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆది నుండి చక్కటి ఫీల్డింగ్‌తో టీం ఇండియా క్రికెటర్లు శ్రీలంక పరుగులకు అడ్డుకట్ట వేశారు. కానీ చివర్లో ప్ర‌యంజ‌న్, మున్వీరా రాణించారు. భార‌త టార్గెట్ 171 ప‌రుగులు.