Asianet News TeluguAsianet News Telugu

చిత‌గొట్టిన ధోనీ, పాండే, భారీ స్కోర్ చేసిన టీం ఇండియా

  • సెంచరీలు చేసిన కోహ్లీ, రోహిత్.
  • అర్ధ పెంచరీ చేసిన మనీష్ పాండే.
  • రాణించిన మహేంద్ర సింగ్ ధోనీ.
india gets high score in 4th odi

శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డే లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. ధోనీ(నాటౌట్‌) 49 ప‌రుగులు, మ‌నీష్ పాండే(నాటౌట్‌) 50ప‌రుగులు చేశారు. ఇద్ద‌రు దూకుడుగా ఆడారు. లోకేశ్ రాహుల్ (7) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ మునుపటి ధోనీని తలపించాడు. చురుగ్గా కదులుతూ త‌న పాత పుట్‌వ‌ర్క్‌ను గుర్తిచేశాడు. 5 ఫోర్లు, ఒక సిక్స్ తో 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

 మరో ఎండ్‌లో ఉన్న మనీష్ పాండే కూడా చక్కగా ఆడాడు. ఈ క్రమంలో మనీశ్ పాండే 42 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులు (నాటౌట్) పూర్తి చేసుకున్నాడు. అంత‌కు ముందు విరాట్, రోహిత్ శ‌ర్మ పెంచ‌రీలు చేశారు. కోహ్లీ 96 బంతుల్లో 131 ప‌రుగులు చేయ‌గా, రోహిత్ శ‌ర్మ 104 ప‌రుగులు చేశాడు. ధావ‌న్ 4, పాండ్యా 19, రాహుల్ 7 ప‌రుగులు మాత్ర‌మే చెయ్య‌గ‌లిగారు.

india gets high score in 4th odi

మరిన్ని వివరాల కోసం కింద క్లిక్ చేయండి  

 

Follow Us:
Download App:
  • android
  • ios