హైదరాబాద్ లో త్వరలో మూడో ఏరో స్పేస్ పార్క్
హైదరాబాద్ లో త్వరలో మూడో ఏరో స్పేస్ పార్క్
హైదరాబాద్ లో మూడో ఏరో స్పేస్ పార్క్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఐటి మంత్రి కెటిఆర్ ప్రకటించారు. ఆదిబట్ల, శంషాబాద్ లలో ఇప్పటికే రెండు ఏరో స్పేస్ పార్కులు ఇప్పటికే అభివృద్ధి అయ్యాయని, తొందర్లోనే మూడోది కూడా వస్తుందని ఆయన చెప్పారు. ‘రక్షణ, వైమానిక రంగాల పరిశ్రమలలో హైదరాబాద్ దూసుకు పోతోంది.హైదరాబాద్ ను రక్షణ, వైమానిక రంగాల హబ్ గా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం,’ అని కెటిఆర్ అన్నారు. త్వరలో హైదరాబాద్ లో రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని కూడా చెప్పారు.
ఈ రోజు ఆయన నాదర్ గుల్ లో నిక్సన్ ఎరో ప్లాంట్ ప్రారంభానికి హజరయ్యరు. అక్కడ ప్రసగించారు.
హైదరాబాద్ లో వైమానిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం లండన్ కు చెందిన ట్రాన్ ఫిల్డ్ విశ్వవిద్యాలయంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని కూడా ఆయన ఇక్కడ గుర్తు చేశారు.