Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం జన సమితి తొలి గెలుపు

తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ తెలంగాణ జన సమితి తొలి విజయాన్ని నమోదు చేసింది. నిర్బంధాలను అధిగమించింది. రాచరికంపై పోరాడి గెలిచింది.
ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన పార్టీ తెలంగాణ జన సమితి. ఆ పార్టీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న దశలో తెలంగాణ సర్కారు కత్తిగట్టింది. జన సమితి ఆవిర్భావ సభ జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నవేళ సభకు అనుమతి నిరాకరించింది సర్కారు. సభకు వాహనాలొస్తే కాలుష్యం పెరిగిపోతుందని పోలీసులు సభకు అనుమతి నిరాకరించారని జన సమితి నేతలు కామెంట్ చేశారు.


ఆవిర్భావ సభ అనుమతి కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన జన సమితి తుదకు న్యాయస్థానం మెట్లెక్కింది. తమ సభకు అనుమతి ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది. దీంతో హైకోర్టు అనుమతి లభించింది. జన సమితి ఆవిర్భావ సభ అనుకున్నట్లుగానే ఈనెల 29న జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈనెల 29న సరూర్ నగర్ మైదానంలో జన సమితి ఆవిర్భావ సభ జరిపేందుకు జెఎసి ప్రతినిధులు, జన సమితి సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సభ కోసం ఎల్ బి నగర్ డిసిపికి, కలెక్టర్ కు, రాచకొండ సిపికి దరఖాస్తు పెట్టుకోవాలని జన సమితి సభ్యులకు సూచించింది హైకోర్టు. వారు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను అట్టహాసంగా జరిపేందుకు కోదండరాం అండ్ టీం ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ సర్కారు ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరించింది. అంతేకాదు యాదవుల అభినందన సభ కూడా అదేరోజు అంటే ఈనెల 29న జరిపేందుకు సర్కారు ప్రయత్నించింది. కానీ కోర్టులో జన సమితికి అనుకూలంగా వస్తుందన్న కారణంతో యాదవుల అభినందన సభను సర్కారు వాయిదా వేసుకుంది.


జెఎసి నేతృత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఆందోళనలు చేపట్టారు కోదండరాం. కానీ ఆయన ఏ నిరసన కార్యక్రమం చేద్దామన్నా తెలంగాణ సర్కారు కాలు కదలనీయలేదు. ఇంట్లో నుంచి బయటకొస్తే అరెస్టు చేసింది. హైదరాబాద్ పొలిమేరలు దాటనీయకుండా పోలీసు బలగాలను అడ్డం పెట్టింది. ఒకసారైతే ఇంట్లో ఉన్నా తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేసేసింది. ప్రతి సందర్భంలో జెఎసి కోర్టుల్లో అనుమతులు తెచ్చుకుని సభలు, సమావేశాలు, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అవే ఆంక్షలు కొనసాగించింది సర్కారు. దీంతో కోదండరాం సర్కారు వైఖరిపై న్యాయపోరాటం చేసి తొలి విజయాన్ని నమోదు చేశారు. 


మరి ఈనెల 29న జరిపే సభకు ఎంతవరకు జనాలను కదిలిస్తారు? ఒకవేళ పోలీసులు గతంలో మాదిరిగా ఈ సభకు కూడా జనాలు రాకుండా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

High Court allows Kodandarama to hold Janasamithi first public meeting in Hyderabad

తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన రాజకీయ పార్టీ తెలంగాణ జన సమితి తొలి విజయాన్ని నమోదు చేసింది. నిర్బంధాలను అధిగమించింది. రాచరికంపై పోరాడి గెలిచింది.
ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటైన పార్టీ తెలంగాణ జన సమితి. ఆ పార్టీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న దశలో తెలంగాణ సర్కారు కత్తిగట్టింది. జన సమితి ఆవిర్భావ సభ జరుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నవేళ సభకు అనుమతి నిరాకరించింది సర్కారు. సభకు వాహనాలొస్తే కాలుష్యం పెరిగిపోతుందని పోలీసులు సభకు అనుమతి నిరాకరించారని జన సమితి నేతలు కామెంట్ చేశారు.


ఆవిర్భావ సభ అనుమతి కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన జన సమితి తుదకు న్యాయస్థానం మెట్లెక్కింది. తమ సభకు అనుమతి ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది. దీంతో హైకోర్టు అనుమతి లభించింది. జన సమితి ఆవిర్భావ సభ అనుకున్నట్లుగానే ఈనెల 29న జరిపేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈనెల 29న సరూర్ నగర్ మైదానంలో జన సమితి ఆవిర్భావ సభ జరిపేందుకు జెఎసి ప్రతినిధులు, జన సమితి సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సభ కోసం ఎల్ బి నగర్ డిసిపికి, కలెక్టర్ కు, రాచకొండ సిపికి దరఖాస్తు పెట్టుకోవాలని జన సమితి సభ్యులకు సూచించింది హైకోర్టు. వారు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోగా అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.


తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభను అట్టహాసంగా జరిపేందుకు కోదండరాం అండ్ టీం ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ సర్కారు ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరించింది. అంతేకాదు యాదవుల అభినందన సభ కూడా అదేరోజు అంటే ఈనెల 29న జరిపేందుకు సర్కారు ప్రయత్నించింది. కానీ కోర్టులో జన సమితికి అనుకూలంగా వస్తుందన్న కారణంతో యాదవుల అభినందన సభను సర్కారు వాయిదా వేసుకుంది.


జెఎసి నేతృత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఆందోళనలు చేపట్టారు కోదండరాం. కానీ ఆయన ఏ నిరసన కార్యక్రమం చేద్దామన్నా తెలంగాణ సర్కారు కాలు కదలనీయలేదు. ఇంట్లో నుంచి బయటకొస్తే అరెస్టు చేసింది. హైదరాబాద్ పొలిమేరలు దాటనీయకుండా పోలీసు బలగాలను అడ్డం పెట్టింది. ఒకసారైతే ఇంట్లో ఉన్నా తలుపులు బద్ధలు కొట్టి అరెస్టు చేసేసింది. ప్రతి సందర్భంలో జెఎసి కోర్టుల్లో అనుమతులు తెచ్చుకుని సభలు, సమావేశాలు, ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా అవే ఆంక్షలు కొనసాగించింది సర్కారు. దీంతో కోదండరాం సర్కారు వైఖరిపై న్యాయపోరాటం చేసి తొలి విజయాన్ని నమోదు చేశారు. 


మరి ఈనెల 29న జరిపే సభకు ఎంతవరకు జనాలను కదిలిస్తారు? ఒకవేళ పోలీసులు గతంలో మాదిరిగా ఈ సభకు కూడా జనాలు రాకుండా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios