ఏప్రిల్ 1 లోపు మీరు బైక్ కొంటే దాదాపు రూ. 12,500 వరకు తగ్గింపు పొందొచ్చు. అన్ని బైక్ కంపెనీలు ఈ భారీ ఆఫర్ ను ప్రకటించాయి. 

టూ వీలర్ల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని నివారించే విషయంలో భాగంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు వినియోగదారులకు వరంగా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీఎస్‌-3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై ఇటీవల సుప్రీం నిషేధం విధిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ బీఎస్3 ప్రమాణాలు అంటే ఏంటా అనుకుంటున్నారా.. బీఎస్ Bharat stage emission standards.

కేంద్రం పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించే విధానంలో భాగంగా బీఎస్ ప్రమాణాలతో అత్యధికంగా కాలుష్యం వెలువరించే వాహనాలను నిషేధించేవిధంగా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది.

ఏప్రిల్‌ 1 తర్వాత బీఎస్ 3 ప్రమాణాలు కలిగిన వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో బైక్ కంపెనీలు తమ వాహనాలను మార్చి 31 లోపే అమ్ముకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించాయి.