ఈ రోజు రూ. 250 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 29,250 కు చేరింది

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. వరుసగా నాలుగో రోజు కూడా పసడి ధర తగ్గింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 30 వేల దిగువకు పడిపోయింది.

ఈ రోజు రూ. 250 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 29,250 కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గడంతో డిమాండ్‌ పడిపోయిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఇక వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 600 తగ్గి రూ. 42వేల దిగువకు చేరింది.

ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 41,500 గా ఉంది.