ఫ్లిప్ కార్ట్ లో భారీ మార్పు
- సహవ్యవస్థాపకుడు బన్నీ బన్సల్ తొలగింపు
ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సల్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి తొలగించింది.
టైగర్ గ్లోబల్ మాజీ అధికారి కల్యాణ్ కృష్ణమూర్తి ఆయన స్థానంలో నియమిస్తున్నట్లు ప్రకటించింది.
బన్సల్ ను మాత్రం సంస్థ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి పరిమితం చేసింది. సంస్థలో జరిగిన ఈ భారీ మార్పు కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా మార్పులతో ఫ్లిప్కార్ట్లో అత్యధిక పెట్టుబడులు కలిగిన టైగర్ గ్లోబల్ కంపెనీకి పూర్తి స్థాయి హక్కులు వచ్చినట్లైంది.