ఇంత దారుణం జరిగినా ఆ ముసలిదంపతులు తమ మనవరాలిపై పోలీసులు స్టేషన్ లో కేసు వేయడానికి ఒప్పుకోలేదు.

మనవరాలు అని గారాబం చేసినందుకు ఆ తాతయ్య, నానమ్మలు ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. మత్తు పదార్థాలు తీసుకోవద్దని సూచించినందుకు కర్ణాటకలోని ఓ యువతి సొంత తాతయ్య, నానమ్మలను ఇంట్లో బంధించి నిప్పుపెట్టింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నెల 16న మైసూర్ లో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియదర్శిని అనే యువతి మోడల్ గా ఇప్పుడిప్పుడే రాణిస్తుంది. అయితే ఆమె డ్రగ్స్ కు బానిసగా మారింది.

ఈ విషయంపై తాతయ్య ఆమెను పలుసార్లు హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకోవద్దని కోరాడు. అయితే తాతయ్య మాటలు ఆమెకు కంపరం పుట్టించాయి. వెంటనే తాతయ్య, నానమ్మలను ఇంట్లో బంధించి నిప్పు పెట్టింది.

సరైన సమయంలో ఇరుగుపొరుగు గమనించడంతో వారిని ఎట్టకేలకు ప్రాణాలతో రక్షించగలిగారు. ఇంత దారుణం జరిగినా ఆ ముసలిదంపతులు తమ మనవరాలిపై పోలీసులు స్టేషన్ లో కేసు వేయడానికి ఒప్పుకోలేదు.

http://newsable.asianetnews.tv/video/model-locks-up-grandparents-sets-house-on-fire