కృష్ణా జిల్లాలో డెంగి హై అలర్ట్
కృష్ణా జిల్లాలోని బాపులపాడు,జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలను డెంగి మండలాలుగా ప్రకటించారు. ఈ మూడు మండలాలలో డెంగి హైఅలర్ట్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. దీనితో ఉన్నతాధికారులు ఈ ప్రాంతాలను సందర్శించి పరిస్థితి గమనిస్తున్నారు.
కృష్ణాజిల్లాలోని బాపులపాడు,జి.కొండూరు,ఇబ్రహీంపట్నం మండలాలను డెంగ్యూ మండలాలుగా ప్రకటించారు. ఈ మూడు మండలాలలో డెంగి హై అలర్ట్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. దీనితో ఉన్నతాధికారులు ఈ ప్రాంతాలను సందర్శించి పరిస్థితి గమనిస్తున్నారు.
హైఎలర్ట్ ప్రకటిచడంతో ముమ్మర పారిశద్య చర్యలు చేపట్టారు. ఈ మూడు మండలాలలో అంతుపట్టని జ్వరాలతో పెద్దసంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. అయితే, ఇక్కడ డెంగి వ్యాపించిందని, చికిత్స నివారణ చర్యలు తీసుకుంటున్నామని,ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు.
ప్రజలను ఆందోళనను గమనించి పరిస్థితిని అదుపు చేసేందుకే ఈ మూడు మండలాలను డెంగ్యూ మండలాలుగా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.