మహిళా క్రికెట్ జట్టుకు కెసిఆర్ ప్రశంస
- ఓడిపోయినా సరే భారతీయ మహిళా క్రికెట్ జట్టు బాగా పోరాడిండి
- భారత దేశ అమ్మాయిలకు క్రీడా స్ఫూర్తి నిచ్చారు
మహిళల వరల్డ్ కప్ లో భారత జట్టు ఆధ్యంతం పోరాట స్పూర్తిని కనబరిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కితాబునిచ్చారు. ఫైనల్ లో పోరాడి ఓడినప్పటికి భారత అమ్మాయిలు వరల్డ్ కప్ లో రన్నర్స్ గా నిలవడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ కు చెందిన కేప్టెన్ మిథాలి రాజ్ తో పాటు జట్టు సభ్యులందరిని ముఖ్యమంత్రి అభినందించారు. అమ్మాయిలు క్రీడల్లో రాణించాలనే స్పూర్తిని రగిలించడంలో క్రికెట్ వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు ప్రదర్శించిన ప్రతిభ దారి చూపుతుందని కేసిఆర్ అభిప్రాయ పడ్డారు. మహిళలను క్రీడారంగంలో మరిత ప్రొత్సహించాల్సిన అవసరం వుందన్నారు.