అదుపు తప్పిన సిటి బస్సు
విజయవాడ, సింగ్ నగర్ బుడమేరు వంతెన వద్ద 16వ నెంబర్ సిటీ బస్సు ఢీ కొని ఇద్దరు దుర్మరణం చెందారు. వాంబే కాలనీ నుండి బస్టాండ్ వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావటంతో బస్సు జనాలపైకి దూసుకెళ్లి, భీభత్సం సృష్టించింది. ఫలితంగా ఇద్దరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. మూడు బైకులు ద్వంసమయ్యాయి.




ప్రమాదం ఇలా జరిగింది:
విజయవాడ- ముత్యలంపాడు బడమేరు వంతెన సమీపంలో అర్టీసి బస్సు బీభత్సం సృష్టించింది. 🎥 విజయవాడ గవర్నర్ పేట 2 డిపో కి చెందిన బస్సు ఎపి 11 జడ్ 6604 సిటి బస్సు వాంబే కాలనీ నుండి కాళేశ్వరరావు మార్కెట్ కి వెళ్తున్నది. సింగ్ నగర్ ప్లైఓవర్ దాటగానే బుడమేరు వంతెన టర్నింగ్ లో బస్ బ్రేక్ పెయిల్ అయింది. ఒక్కసారి గా బస్ రోడ్డు మీద వెళ్తున్న పాదచారుల ను ద్విచక్ర వాహనాలు ఢి కోట్టింది. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. నాలుగు ద్విచక్ర వాహనాలను కొట్టేసి బస్ అగింది. ఆ ప్రాంత జనాలు భయభ్రాంతులయ్యారు.మృతి చెందిన వారు మహిళ, చిన్న పాప ..వీరు మైలవరం కి చెందిన వారు గా పోలిసులు భావిస్తున్నారు. రంగంలో కి దిగిన పోలిసులు బస్ వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నారు
