బీఎస్ఎన్ఎల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్
- 50శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ను అందిస్తున్నది. దీని ప్రకారం కస్టమర్లు రూ.250 కన్నా తక్కువ విలువైన ప్లాన్ను రీచార్జి చేసుకుంటే వారికి మ్యాగ్జిమమ్ రూ.50 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే రూ.250 కన్నా ఎక్కువ విలువైన ప్లాన్ను రీచార్జి చేసుకుంటే మ్యాగ్జిమమ్ రూ.75 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే ఇందుకు గాను కస్టమర్లు ఫోన్ పే వాలెట్లో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో క్యాష్ బ్యాక్ కూడా నేరుగా ఆ వాలెట్లో జమ అవుతుంది. అయితే ఫోన్ పే వాలెట్లో మొదటిసారిగా బీఎస్ఎన్ఎల్ రీచార్జి చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్కు ఈ నెల 20వ తేదీ వరకు గడువు నిర్ణయించారు.